క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లా బల్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కూట్ గ్రామంలో ఇందల్ సింగ్ జాదవ్ బంజారా అనే 22 యువకుడు శనివారం సాయంత్రం తన మిత్రులతో కలిసి క్రికెట్ ఆడాడు. బౌలింగ్ చేసే సమయంలో అతడు అసౌకర్యానికి గురైనట్లు గ్రామస్థుడు శాలిగ్రామ్ గుర్జర్ చెప్పాడు. దీంతో అతడు చెట్టు కింద కూర్చున్నాడని వెల్లడించాడు. అతడి జట్టు విజయం సాధించిన అనంతరం ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పాడని, వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కోరాడన్నారు. తోటి మిత్రులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్లు తెలిపారన్నాడు. గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారని, పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)