శీతాకాలంలో జామపండ్లు అన్ని ప్రాంతాల్లో లభిస్తాయి. ఇది శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడం, బరువును నియంత్రించడంలో జామ అద్భుతంగా పనిచేస్తుంది. జామపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జామపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచని ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ చాలా మేలు చేస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు బరువును నియంత్రించాలనుకుంటే, జామపండ్లను తినొచ్చు. ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీవక్రియను బలపరుస్తుంది. జామపండులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. అందుకే ఒత్తిడికి లోనైనప్పుడు జామపండ్లను తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా చలికాలంలో జామ తప్పనిసరిగా తినాలి. జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచంలో సహాయపడుతుంది.
మధుమేహం - జామకాయ !
December 06, 2023
0
Tags