న్యూఢిల్లీలో కాంగ్రెస్ గుజరాత్ యూనిట్ నేతలతో ఎన్నికల సంసిద్ధత సమావేశం అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన జరిగిందని, అయితే ప్రధాని నరేంద్ర మోడీ విధానాల వల్ల యువతకు ఉద్యోగాలు రావడం లేదని అన్నారు. ''పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన జరిగింది. అయితే అది ఎందుకు జరిగింది?" రాహుల్ ప్రశ్నించాడు. "దేశంలో అతి పెద్ద సమస్య నిరుద్యోగం. ఈ సమస్యతో యువత దేశవ్యాప్తంగా ఉడికిపోతోంది. మోడీ విధానాల వల్ల దేశ యువతకు ఉపాధి లభించడం లేదు' రాహుల్ అన్నారు. కాగా భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్షాలు ప్రభుత్వం నుండి సమాధానాలు కోరుతున్నాయి. పార్లమెంటులో ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి ప్రకటనను డిమాండ్ చేశాయి. డిమాండ్ కోసం ఒత్తిడి తెచ్చేందుకు ఉభయ సభల కార్యక్రమాలను కూడా అడ్డుకున్నారు.
నిరుద్యోగం, ధరల పెరుగుదల కారణంగానే పార్లమెంట్ పై దాడి !
December 16, 2023
0
Tags