ప్రేమ వ్యవహారం యువకుడి ప్రాణం తీసింది !

Telugu Lo Computer
0


ఢిల్లీలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 20 ఏళ్ల మహిర్, ఢిల్లీలోని పహర్‌గంజ్‌లో ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపులో పనిచేసేవాడు. 21 ఏళ్ల యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అయితే 18 ఏళ్ల అర్మాన్ ఖాన్‌ కూడా ఆ యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్నాడు. కాగా, మహిర్‌, ఆ యువతి వీడియో కాల్‌లో మాట్లాడుకోవడం అర్మాన్‌ కంటపడింది. దీంతో ఆమెతో ఎప్పుడూ మాట్లాడవద్దని మహిర్‌ను హెచ్చరించాడు. అలాగే ఆ యువతి మొబైల్‌ ఫోన్‌ లాక్కున్నాడు. అంతటితో ఆగక మహిర్‌ అడ్డుతొలగించేందుకు ప్లాన్‌ వేశాడు. భాగీరథి విహార్‌ ప్రాంతానికి వస్తే యువతి మొబైల్‌ ఫోన్‌ తిరిగి ఇస్తానని మహిర్‌కు ఫోన్‌ చేశాడు. బుధవారం రాత్రి అక్కడకు వచ్చిన అతడ్ని తన ఇద్దరు మిత్రులతో కలిసి కత్తితో పొడిచి హత్య చేసి వారు అక్కడి నుంచి పారిపోయారు. మరోవైపు వీధిలోని రోడ్డు పక్కగా యువకుడి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించారు. అర్మాన్ ఖాన్‌తో పాటు అతడి మిత్రులైన 21 ఏళ్ల ఫైజల్‌, 19 ఏళ్ల సమీర్‌ను అరెస్ట్‌ చేశారు. మహిర్‌ హత్యకు లవ్‌ ట్రయాంగిల్‌, అసూయ కారణమని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)