మిజోరంలో ఎన్నికల రాజకీయాలు ఊపు అందుకున్నాయి. వచ్చే నెలలో ఎన్నికలకు సిద్దమవుతున్న మిజోరంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందన్న సర్వే రిపోర్టులతో అన్ని పార్టీల్ని అప్రమత్తం చేశాయి. దీంతో ఇక్కడ ప్రతీ సీటులోనూ గెలుపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార ఎంఎన్ఎఫ్ అసెంబ్లీ స్పీకర్ లాల్రిన్ లియానా సైలోకు మరోసారి టికెట్ నిరాకరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ నిరాకరించడంతో మిజోరం అసెంబ్లీ స్పీకర్ లాల్రిన్ లియానా సైలో తన సొంత పార్టీ ఎంఎన్ఎఫ్ కు గుడ్ బై చెప్పేశారు. నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ నిరాకరించడంతో మిజోరాం శాసనసభ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించిన ఆయన, మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ కు కూడా గుడ్ బై చెప్పేశారు. తన పదవితో పాటు సభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
టికెట్ నిరాకరించినందుకు మిజోరం స్పీకర్ రాజీనామా !
October 12, 2023
0
Tags