పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday 25 October 2023

పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు !

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నుండి మధ్యప్రదేశ్‌లోని శివానికి వెళ్తున్న పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ లోని నాలుగు కోచ్‌లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా థానా మల్పురాలోని బధాయి రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైలు ఆగ్రా నుంచి ఝాన్సికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా రైలు బోగీల్లో మంటలు కనిపించడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఆ తరువాత మంటలు వేగంగా నాలుగు కోచులకు వ్యాపించాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదు. స్థానిక రైల్వే అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఎగిసిపడిన మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు చెలరేగిన కంపార్ట్మెంట్ల నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

No comments:

Post a Comment