విద్యార్థిని స్టేజీ దిగాలని చెప్పిన టీచర్ల సస్పెండ్ !

Telugu Lo Computer
0

త్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో ఏబీఈఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో తాజాగా ఫెస్ట్ నిర్వహించారు. విద్యార్థులు అందరూ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఇందులో పాల్గొంటున్నారు. ఓ విద్యార్థి స్టేజీ ఎక్కి తన ప్రదర్శనను ప్రారంభిస్తున్న సమయంలో కింది నుంచి కొందరు తోటి విద్యార్థులు జై శ్రీరాం అని నినాదాలు చేశారు. దీంతో స్టేజీపై ఉన్న విద్యార్థి కూడా జై శ్రీరాం ఫ్రెండ్స్ అని మైకులో రిప్లై ఇచ్చాడు. దీంతో వెంటనే అతడిని ఓ టీచర్ స్టేజీపై నుంచి కిందికి దిగాలని ఆదేశించారు. ఇది సాంస్కృతిక కార్యక్రమమని, అటువంటి నినాదాలు చేయకూడదని ఆ టీచర్ తిట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఘజియాబాద్ పోలీస్ కమిషనర్ దీనిపై స్పందించారు. ఆ ఘటనపై దర్యాప్తు చేయాలని సంబంధిత పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. కాగా, జై శ్రీరాం నినాదం చేసినందుకు విద్యార్థిని స్టేజీ దిగాలని చెప్పిన టీచర్ తో పాటు ఇప్పటికే ఇద్దరు ప్రొఫెసర్లపై కాలేజీ అధికారులు చర్యలు తీసుకున్నారు. వారిద్దరిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)