కాంగ్రెస్ అవినీతి ఫుడ్ చైన్ రెస్టారెంట్ లాగా ఢిల్లీ వరకు విస్తరించింది !

Telugu Lo Computer
0

                                        

త్తీస్‌గఢ్ లోని రాజ్‌నంద్‌గావ్ లో జరిగిన ఈ ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ అవినీతి ఫుడ్ ఛైన్ రెస్టారెంట్ లాగా ఢిల్లీ వరకు విస్తరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిపరుల నుంచి ప్రతీ పైసా రికవరీ చేస్తామని, తలకిందులుగా వేలాడదీస్తామని హెచ్చరించారు. గతంలో మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు వెనుకబడిన రాష్ట్రాలుగా ఉండేవని, రమణ్ సింగ్ అధికారంలో వచ్చిన 15 ఏళ్లలో ఛత్తీస్ గఢ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరించిందని ఆయన అన్నారు. ఏప్రిల్ నెలలో బెమెతర జిల్లాలోని బీరాన్ పూర్ గ్రామంలో జరిగిన మతహింసను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సీఎం భూపేష్ బఘేల్‌ని విమర్శించారు. మళ్లీ మతపరమైన అల్లర్లకు కేంద్రంగా మారాలని కోరకుంటున్నారా ? అని ప్రజల్ని ప్రశ్నించారు. వేదికపై ఉన్న ఈశ్వర్ సాహును చూపిస్తూ బుజ్జగింపు రాజకీయం కోసం భువనేశ్వర్ సాహూను కొట్టి చంపారని, భువనేశ్వర్ సాహూకు న్యాయం చేయాలని అతని తండ్రికి టికెట్ ఇచ్చామని అమిత్ షా అన్నారు. ఛత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్ హయాంలో వివిధ రకాల కుంభకోణాలు జరిగాయని, రాష్ట్రాన్ని ఢిల్లీ దర్బారుకు ఏటీఎంగా మార్చారని అమిత్ షా ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)