లాడ్జిలో ఉరివేసుకొని యువతి మృతి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday 26 October 2023

లాడ్జిలో ఉరివేసుకొని యువతి మృతి !


ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులోని పృథ్వీ లాడ్జిలో యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెంది, యువకుడు రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంఘటన లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.సంఘటనకు సంబంధించి పట్టణ సీఐ పీవీ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కుమ్మరిపాలెంలో ఎస్‌కే షబ్బీర్‌ మెకానిక్‌ వర్క్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. షబ్బీర్‌ వాళ్ల ఇంటిలో ఆయేషా బేగం తల్లిదండ్రులు అద్దెకు ఉంటున్నారు. అయితే షబ్బీర్‌కు వివాహమై భార్యతో కొంత కాలం నుంచి విడిపోయి ఉంటున్నాడు. వారికి ఒక పాప ఉంది. ఈ క్రమంలోనే షబ్బీర్‌, ఆయేషాబేగం (21)కు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆయేషా పట్టణంలోని లాట్‌ మొబైల్‌ షాపులో పనిచేస్తూ సాయంత్రం ఇంటికి వచ్చేది. అయితే బుధవారం ఇంటికి రాకపోయేసరికి తండ్రి రెహమాన్‌ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఫోన్‌ నెంబర్‌ ద్వారా ఉన్న ఆయేషాబేగం ఉంటున్న ప్లేస్‌ను ట్రేస్‌ చేసి తండ్రి రెహమాన్‌, బంధువులు, పోలీసులు వెళ్లి రూమ్‌ తలుపు కొట్టగా ఎవరు తీయకపోయేసరికి వెంటనే తలుపులు బద్ధలు కొట్టగా ఆయేషా ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందగా, షబ్బీర్‌ రెండు చేతులు కోసుకొని రక్తపు మడుగులో ఉన్నాడు. వెంటనే పోలీసులు షబ్బీర్‌ను పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కు తరలించారు. పట్టణ సీఐ పీవీ ఆంజనేయులు సంఘటన స్థలాన్ని, హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న షబ్బీర్‌ను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడవుతాయని సీఐ పీవీ ఆంజనేయులు తెలియజేశారు. 

No comments:

Post a Comment