ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. ఇజ్రాయెల్లో ఉత్సాహంగా జరుగుతున్న ఓ డ్యాన్స్ పార్టీపై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడితో అనేక మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. ఒక్కసారిగా ఆకాశం నుంచి రాకెట్లు, మరోవైపు తూటాలతో మిలిటెంట్లు విరుచుకుపడటంతో వందల సంఖ్యల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. తాజాగా పీస్ ఫెస్టివల్లో పాల్గొన్న అర్గమణి (25) అనే యువతిని హమాస్ మిలిటెంట్లు కిడ్నాప్ చేసి బలవంతంగా బైక్పై తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. బైక్పై తీసుకెళ్తున్న సమయంలో అర్గమణి మిలిటెంట్లను బతిమాలుతోంది. 'ప్లీజ్..నన్ను చంపకండి! దయచేసి విడిచిపెట్టండి' అంటూ ఏడుస్తోంది. ఆమె బాయ్ఫ్రెండ్ నాథన్ను కూడా హమాస్ దళాలు బంధించి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారుతోంది. అదే సమయంలో తన సోదరుడు సోథన్ కనబడటం లేదని మోషే ఓర్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బయటకువచ్చిన ఈ వీడియో ఆధారంగా సోథన్ను కూడా కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబసభ్యులకు తెలియజేశారు.
ప్లీజ్.. నన్ను చంపకండి !
October 08, 2023
0
Tags