ప్లేట్ లెట్లు పడిపోతే బొప్పాయి,వేప,జామ ఆకుల రసాలు తాగితే పెరుగుతాయి !

Telugu Lo Computer
0


డెంగీ జ్వరం వస్తే ఒళ్లంతా నొప్పులు, తీవ్రంగా జ్వరం, వణికిపోడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. డెంగీ జ్వరం వచ్చిన వారిలో ఎక్కువగా ప్లేట్ లెట్ల పడిపోతూంటాయి. ప్లేట్ లెట్ల పడిపోవడం అంటే ప్రాణం మీదకి వచ్చినట్టే. అయితే ప్లేట్ లెట్ల సంఖ్య పెంచడానికి కొన్ని రకాల ఆకులు బాగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

బొప్పాయి ఆకులు : రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య పెంచడానికి బొప్పాయి ఆకులు బాగా హెల్ప్ చేస్తాయి. వీటి రసం కానీ, కషాయం కానీ తాగితే ప్లేట్ లెట్ల కౌంట్ వెంటనే పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటి రసం తాగడం వల్ల ప్లేట్ లెట్ల సంఖ్య పెరగడమే కాకుండా జ్వరం కూడా తగ్గుతుంది.

వేప ఆకులు : వేప ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాబట్టి వేప ఆకుల్ని తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్ల కౌంట్ అనేది తగ్గుతుంది. వేపాకుల్ని నీటిలో మరిగించి.. ఆ నీటిని తాగడం వల్ల.. ప్లేట్ లేట్ల సంఖ్య పెరగడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

జామ ఆకులు : జామ ఆకుల్లో కూడా యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి జామ ఆకుల్ని తీసుకున్నా ప్లేట్ లెట్లను పెంచుకోవచ్చు. రెండు గ్లాసుల నీటిలో.. జామ ఆకులు వేసి సగం అయ్యేవరకు మరిగించుకోవాలి. ఇవి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తేనె కలుపుకుని తాగిలి. ఇలా రోజుకు మూడు సార్లు తాగితే.. ప్లేట్ లెట్లను పెంచుకోవచ్చు. డెంగీని తగ్గించుకోవచ్చు. ఈ ఆకులతో పాటు డాక్టర్లు ఇచ్చే మందులను కూడా వేసుకుంటే డెంగీని అదుపులోకి తీసుకురావచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)