ఛత్తీస్గఢ్ లో పరివర్తన్ సంకల్పయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్బంగా కార్యక్రమం ముగింపు సభకు ప్రధాని హాజరయ్యారు. బిలాస్పూర్ సైన్స్ కాలేజీ వేదికగా జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ రేషన్, మద్యం దగ్గర నుంచి చివరకు ఆవు పేడను కూడా వారు వదల్లేదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కరోనా టైంలో పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉచిత రేషన్ పంపిణీ చేస్తే ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ సర్కార్ అవినీతికి పాల్పడిందని నిప్పులు చెరిగారు. అవినీతి పాలనలో ఈ రాష్ట్రం కూరుకుపోయిందని, కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రతి స్కీమ్లోనూ ఓ స్కామ్ జరిగింది'' అంటూ ప్రధాని మోదీ దుయ్యబట్టారు.
ప్రతి స్కీమ్లోనూ ఓ స్కామ్ !
September 30, 2023
0
Tags