మేఘనా రాజ్ రీ ఎంట్రీ !

Telugu Lo Computer
0


న్నడ నటి మేఘనా రాజ్ మళ్లీ వెండితెరపై అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. ఆమె నటించిన కన్నడ 'తత్సమ తద్భవ' చిత్రం సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత నటిస్తోన్న మూవీ కావడంతో ఈ కోసం మేఘనా రాజ్ విసృదంగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజైంది. మేఘన భర్త, కన్నడ యాక్షన్‌ హీరో చిరంజీవి సర్జా 2020లో గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటికే ఆమె గర్భంతో ఉండడం, భర్త హఠాన్మరణంతో మేఘన చాలా రోజుల డిప్రెషన్‌కు లొనైంది. అయితే కొడుకు పుట్టిన తర్వాత కాస్త కోలుకుందామె. ఇప్పుడు కొడుకు బాగోగులు చూసుకోవడంతో పాటు రంగంలోనూ బిజీగా ఉంది. 'తత్సమ తద్భవ' తో మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. అందుకే ఈ ప్రమోషన్స్ భారీగానే జరుగుతున్నాయి. కాగా 'తత్సమ తద్భవ' అనేది క్రైమ్ థ్రిల్లర్ . ట్రైలర్‌లో 'నా భర్త తప్పిపోయాడు' అంటూ మేఘనా రాజ్ చెప్పిన లైన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ లో ప్రజ్వల్ దేవరాజ్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. కాగా ఈ రిలీజు దగ్గర పడుతున్న కొద్దీ మేఘన, ప్రజ్వల్, పన్నగా భరణ్‌లు వేర్వేరు కాలేజీలకు వెళ్లి ప్రమోట్ చేస్తున్నారు. మేఘనా రాజ్ కూడా సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్‌లను షేర్ చేస్తున్నారు. కాగా మేఘనా రాజ్‌ తెలుగు తోనే వెండితెరకు పరిచయమైంది. అల్లరి నరేష్‌ నటించిన 'బెండు అప్పారావ్‌ ఆర్‌ఎంపీ' తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అందులో తనదైన అందం, అభియనంతో ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలోకి వెళ్లిపోయి స్టార్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ సొంత చేసుకుంది. మధ్యలో శ్రీకాంత్‌తో కలిసి లక్కీ అనే లో నటించింది. నటుడు చిరంజీవి సర్జాను ప్రేమించి పెళ్లి మేఘన చేసుకుంది. వివాహమై రెండేళ్లకే భర్తను కోల్పోయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)