ముగ్గురు మహిళలపై సామూహిక లైంగిక దాడి !

Telugu Lo Computer
0


ర్యానాలోని పానిపట్ జిల్లాలో సాయుధులైన కొందరు వ్యక్తులు ఒక ఇంట్లోకి బలవంతంగా చొరబడి, కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టి వారి ఎదుటే ముగ్గురు మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ ఇంట్లోని డబ్బు, నగలు దోచుకున్నారు. కాగా, అదే గ్రామంలో మరో ఇంటిపై కూడా ఆ వ్యక్తులు దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దంపతుల ఇంట్లోకి చొరబడి వారిపై దాడి చేసినట్లు తెలిపారు. ఒక వ్యక్తి నుంచి డబ్బులు, మొబైల్‌ ఫోన్‌ దోచుకున్నారని చెప్పారు. ఈ రెండు సంఘటనలపై ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)