పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో శుక్రవారం నాడు అత్యధిక సంఖ్యలో ప్రార్ధనలు చేస్తున్న ఓ మసీదు ప్రాంగణంలో ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 52 మంది మరణించినట్లు పాక్ మీడియా కథనాలు వెల్లడించాయి. పేలుడు విషయం తెలిసిన వెంటనే పోలీసులు, సైన్యం ,వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన అనేకమందిని చికిత్సకోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ బాంబుదాడికి చేసింది ఎవరో ఇంతవరకు ఏ సంస్థ ప్రకటన విడుదల చేయలేదు.
బలూచిస్తాన్లోని మసీదులో ఆత్మహుతి దాడిలో 52 మంది మృతి !
September 29, 2023
0
Tags