దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ని EG.5.1 !

Telugu Lo Computer
0


ప్పటికే బ్రిటన్, అమెరికాలో కొత్త వేరియంట్‌ని EG.5.1 చాలా జోరుగా ఉంది. రోజువారీ కేసుల్లో దీనివే ఎక్కువ ఉంటున్నాయి. తాజాగా ఇది ఇండియాలోకీ ప్రవేశించింది. మహారాష్ట్రలోని ముంబై, పుణేలో దీని కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా కరోనా కేసులు కొద్దిగా పెరిగాయి. నిజానికి ఇది ఒమైక్రాన్ నుంచి రూపాంతరం చెందిన మరింత శక్తిమంతమైన వేరియంట్. దీన్ని మొదట మేలోనే కనిపెట్టారు. ఇది మే, జూన్, జులైలో పెద్దగా ప్రభావం చూపలేదు. ఐతే.. జులై చివరి నాటికి కరోనా కేసులు 70 ఉండగా.. ఆగస్టు ఆరు నాటికి అవి 116కి పెరిగాయి. కారణం కొత్త వేరియంటే అంటున్నారు. ఎరిస్ వల్ల బ్రిటన్‌లో ముసలివారు ఎక్కువగా ఆస్పత్రిపాలవుతున్నారు. ఐతే.. ICU కేసులు పెద్దగా లేవు. మరణాల సంఖ్య కూడా ఎక్కువ లేదు. తద్వారా ఇది మరీ ప్రాణాంతకమైనది కాకపోవచ్చు అంటున్నారు. అలాగని తేలిగ్గా తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఇండియాలో కోట్ల మంది డబుల్ డోస్ వేసుకున్నారు కాబట్టి ఎరిస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు అంటున్నారు. ఐతే.. ఎరిస్ నుంచి మరో కొత్త వేరియంట్ గనుక ఇండియాలో పుడితే అది ప్రమాదకరం అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ కొత్త వేరియంట్‌ని గమనిస్తోంది. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు వ్యాక్సిన్లు ఎవరూ వేయించుకోవట్లేదు. మూడోదైన బూస్టర్ డోస్ చాలా తక్కువ మందే తీసుకున్నారు. ఆల్రెడీ వేయించుకున్న రెండు డోసుల వల్ల వచ్చే యాంటీబాడీలు ఇప్పుడు దాదాపు లేనట్లే. అందువల్ల ఎరిస్ విజృంభిస్తే ఇండియాలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరం, ముక్కు దిబ్బడ, వాసన తెలియకపోవడం, గొంతు నొప్పి, రొమ్ము పట్టేసినట్లు ఉండటం వంటివి ఎరిస్ లక్షణాలుగా ఉన్నాయి. ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నారు. ఎందుకంటే.. ఇది మిగతా వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తోందని చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)