జార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లాలో కోర్టు బయట ఒక వ్యక్తిని అతడి భార్య, మరదలు కలిసి కొట్టారు. అక్కడున్న వారు జోక్యం చేసుకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఆ మహిళలు అతడ్ని కొట్టడం ఆపలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన రాజ్కుమార్, రామ్గఢ్కు చెందిన ఖుష్బూ కుమారి 2009లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఖుష్బూ అత్త వారింట్లో ఉండక పుట్టింట్లోనే ఉంటున్నది. భర్తను కూడా తన పుట్టింటికి రావాలని ఒత్తిడి చేసింది. రాజ్కుమార్ తన మాట వినకపోవడంతో భరణం కోసం 2017లో రామ్గఢ్ సివిల్ కోర్టును ఆశ్రయించింది. నాటి నుంచి ఈ కేసుపై విచారణ జరుగుతున్నది. కాగా, రాజ్కుమార్ కోర్టు విచారణ కోసం పాట్నా నుంచి రామ్గఢ్ వచ్చాడు. ఈ సందర్భంగా కోర్టు బయట ఉన్న భార్య ఖుష్బూ కుమారి, తన సోదరితో కలిసి భర్తపై దాడి చేసింది. వారిద్దరూ అతడ్ని కొట్టారు. కోర్టు వద్ద ఉన్న ఇతర వ్యక్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మరోవైపు అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో దీనిని రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
కోర్టు బయట భర్తను కొట్టిన భార్య !
August 11, 2023
0
Tags