ముత్యాలు, రత్నాలతో వెండి చెప్పులు !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని లక్నోలో ఓ నగల వ్యాపారి 300 నుంచి 500ల గ్రాముల వెండితో చెప్పులు తయారు చేస్తున్నాడు. వెండిని బట్టి ఈ చెప్పుల విలువ ఉంటుంది. అలాగే ఆ చెప్పుల మీద డిజైన్ కోసం వినియోగించే ముత్యాలు, రత్నాలను బట్టి వాటి విలువ పెరుగుతుంది. రూ.25,000 నుంచి ఆ పైన ఈ చెప్పుల విలువ ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు ఇంతకంటే ఖరీదైనవే వినియోగిస్తుంటారు. వారు ధరించే చెప్పులు, బూట్లు వంటివి లక్షల రూపాయల విలువ చేస్తుంటాయి. కొంతమంది తమ షాపుకు వచ్చినప్పుడు వెండి చెప్పుల గురించి అడగుతుంటారని, అందుకే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది అందుకు వరుడు, వధువుల కోసం చెప్పులు తయారు చేస్తున్నామని ఆర్డర్ ను బట్టి ఇది వారి వారి సైజులకు తగినట్లుగా తయారు చేస్తున్నామని నగల షాపు యజమాని వినోద్ మహేశ్వరి  తెలిపారు. వధువు, వరులకే కాకుండా చిన్నపిల్లలకు కూడా వెండి చెప్పులు తయారు చేస్తున్నామని తెలిపారు. ఈరోజుల్లో వరుడు షేర్వాణీలు ధరించటం సర్వసాధారణంగా మారిపోయింది. షేర్వాణికి తగిన మోడల్ లో వరుడు ధరించే బెల్ట్‌లు కూడా వెండితో తయారు చేస్తున్నారు. వీటిపై చెప్పులపై ముత్యాలు, రత్నాలు పొదిగి అందంగా డిజైన్ చేస్తున్నారు. చక్కటి లుక్ తో ఆకట్టుకుంటుండటంతో చాలా మంది కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని షాపు యజమాని తెలిపారు. 100 నుంచి 500 గ్రాములు ఉండే ఈ పాదరక్షలను రూ. 25 వేలకు విక్రయిస్తున్నారు. ఏది ఏమైనా షేర్వాణీపై వెండి చెప్పులు ధరిస్తే ఆ రాయల్ లుక్ వేరుగా ఉంటుందంటున్నారు.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)