పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మణిపూర్లో జరిగిన దారుణ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. ఇది 140కోట్ల మంది భారతీయులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటనగా అభివర్ణించారు. మణిపూర్లో జరిగిన ఘటన వల్ల తన గుండెల్లో బాధ, కోపం ఉందని ప్రధాని మోడీ తెలిపారు. నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలకు స్థానం లేదన్నారు. ఈ దారుణానికి పాల్పడిన దోషులను వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. శాంతిభద్రతలను పటిష్టంగా ఉంచాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోమని కోరారు. రాజస్థాన్ లేదా ఛత్తీస్గఢ్, మణిపూర్ లేదా దేశంలోని మరే ఇతర మూలలో జరిగిన సంఘటన అయినా, రాజకీయాలకు అతీతంగా పోరాడాలన్నారు. https://t.me/offerbazaramzon
సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన !
July 20, 2023
0
Tags