వినుకొండలో పోలీసుల గాల్లోకి కాల్పులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా వినుకొండ యోజకవర్గంలో ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జీవీ ఆంజనేయులుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నారు. గురువారం కూడా బస్టాండ్‌ సెంటర్‌ వద్ద నిరసనలు చేస్తుండగా అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అతడి అనుచరులతో అక్కడికి రాగా ఇరువర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులకు దిగడంతో ఘర్షణను నిలువరించడానికి సీఐ సాంబశివరావు గాల్లోకి కాల్పులు జరిపారు. టీడీపీ నాయకులపై లాఠీచార్జి చేశారు. అక్కడి నుంచి పంపించి వేశారు. మట్టి తవ్వకాలపై తనపై చేసిన ఆరోపణలకు చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)