కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత అలర్ట్ అయిన బీజేపీ ఐదు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను తొలగించి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని నియమించింది. మరో వైపు ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు. అలాగే బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్న సోమువీర్రాజును తొలగించి పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎంపిక చేసింది. రాజస్థాన్ అధ్యక్షుడిగా గజేంద్ర సింగ్ షెకావత్, పంజాబ్ అధ్యక్షుడిగా సునీల్ జక్కర్, జార్ఖండ్ అధ్యక్షుడిగా బాబులాల్ మరాండి ని నియమించింది. https://t.me/offerbazaramzon
ఐదు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షుల నియామకం
July 04, 2023
0
Tags