76% వరకు రూ. 2 వేల నోట్లు వెనక్కి వచ్చాయి !

Telugu Lo Computer
0


జూన్ 30 నాటికి రూ. 2.72 లక్షల కోట్ల విలువైన బ్యాంక్ నోట్లు తిరిగి బ్యాంకుల్లోకి వచ్చాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రజల వద్ద ఇంకా రూ. 84 వేల కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు చెలామణిలో ఉన్నాయని వివరణ ఇచ్చింది. వ్యవస్థలో ఉన్న దాదాపు 76 శాతం వరకు రూ. 2 వేల నోట్లు వెనక్కి వచ్చాయని ఆర్‌బీఐ తెలిపింది. ప్రజలు బ్యాంక్‌లో డిపాజిట్ చేయడం లేదా ఎక్స్చేంజ్ చేసుకోవడం చేశారని వివరించింది. అలాగే మరో అంశాన్ని కూడా తెలిపింది. ప్రజలు ఇంకా వారి వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంకులకు వచ్చి మార్చుకోవాలని కోరింది. సెప్టెంబర్ 30 కల్లా ఈ పని పూర్తి చేసుకోవాలని సూచించింది. ఆర్‌బీఐ రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ అంశాన్ని మే 19న వెల్లడించింది. అప్పటి నుంచి చూస్తే.. జూన్ 30 నాటికి వ్యవస్థలో రూ. 2 వేల నోట్ల చెలామణి చాలా తగ్గింది. చాలా వరకు రూ.2 వేల నోట్లు వెనక్కి వచ్చాయి. మే నెలలో వ్యవస్థలో చెలామణిలో ఉన్న రూ .2 వేల నోట్లు రూ. 3.56 లక్షల కోట్లు. అయితే ఇప్పుడు చెలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లు రూ. 84 వేల కోట్లకు తగ్గాయి. బ్యాంకుల్లోకి వచ్చిన రూ. 2 వేల నోట్లను గమనిస్తే.. వీటిల్లో 87 శాతం బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి. ఇక 13 శాతం మాత్రం రూ. 2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకున్నారు. https://t.me/offerbazaramzon


Post a Comment

0Comments

Post a Comment (0)