జూన్ నెల చివరికొచ్చినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఎండలకు తోడు వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు రాబోయే రోజుల్లో పది రాష్ట్రాల్లో వేడిగాలుల తీవ్రత పెరుగుతుందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడు రోజులు వేడిగాలుల తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది. వేడిగాలుల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మరో వైపు బిహార్లో హీట్వేవ్ గత 11 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. మరో వైపు తీవ్ర ఎండల నేపథ్యంలో జార్ఖండ్లో జూన్ 17 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇదే సమయంలో పశ్చిమ, ఆగ్నేయ ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మరో మూడు రోజులపాటు వడగాలులు !
June 18, 2023
0
Tags