కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన యువతి (21)తో హస్సాన్ జిల్లాకు చెందిన ఓ యువకుడికి పెద్దల సమక్షంలో గత ఏడాది వివాహం జరిగింది. భర్త బెంగళూరులోని ఓ సెక్యూరిటీ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తుంటారు. ఆమె గృహిణిగా ఉంటోంది. అయితే పెళ్లి చేసుకుని అన్యోన్యంగా బతకాలనే తన కలను భర్త నెరవేర్చడం లేదని బాధితురాలు పోలీసులకు తెలిపింది. చాలా ప్రేమగా మాట్లాడినా చిరాకు పడుతున్నాడని పేర్కొంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరడంలేదని, శృంగార జీవితం పేలవంగా ఉందని ఫిర్యాదులో పేర్కొంది.
ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరడంలేదు : భర్తపై భార్య ఫిర్యాదు
June 10, 2023
0
Tags