ఫిలిప్పిన్స్​ మైనింగ్ తవ్వకాల్లో బయటపడ్డ త్రిశూలం, వజ్రాయుధం

Telugu Lo Computer
0


కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త సయ్యద్ శామీర్ హుస్సేన్ బెంగళూరులోని ప్రెస్​ క్లబ్​లో  10 వేల ఏళ్ల నాటి త్రిశూలం, 3 వేల ఏళ్ల కిందటి వజ్రాయుధాన్ని ప్రదర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ  ‘ 2015 మే నెలలో ఫిలిప్పిన్స్​ మైనింగ్ తవ్వకాలల్లో ఈ త్రిశూలం, వజ్రాయుధం బయటపడ్డాయి. ​2012 నుంచి ఫిలిప్పిన్స్ కాపర్, గోల్డ్ మైనింగ్​ల్లో తను భాగస్వామిని అని తెలిపారు. వ్యాపార రీత్యా తన సమయాన్ని ఫిలిప్పిన్స్​లోనే ఎక్కువగా గడుపుతూ ఉంటానని, అలాగే అక్కడి పౌరులతో కలిసి పనిచేయడం వల్ల వారితో దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయని అన్నారు. ఈ క్రమంలో 2015 మే 5న మైనింగ్ సూపర్​వైజర్​  తాను మునుపెన్నడూ చూడని వస్తువులు తవ్వకాలలో బయటపడ్డాయని తెలిపారు. వాటిని నీటితో శుభ్రం చేయగా అందులో ఒకటి చూడడానికి దేవుడి విగ్రహంలా ఉంది. ఇక రెండోది త్రిశూలంగా గుర్తించాము. అయితే ఈ రెండూ కూడా హిందు పురాణాలకు సంబంధించిన వస్తువులుగా నిర్థారించినట్లు తెలిపారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి వాటి ఫొటోలను స్నేహితులందరికీ పంపానని తెలిపారు. వాటిపై పరిశోధన కోసం ఇంటర్​నెట్​ వెతికారట. త్రిశూలంతో పాటు దొరికిన మరో వస్తువు వజ్రాయుధం అని తెలిసిందని అన్నారు. అది హిందూ పురాణాల్లో ఇంద్ర భగవానుడి ఆయుధం, త్రిశూలం శివుడిది అయ్యుండవచ్చని భావించి తర్వాత భారత్​కు వచ్చి పురావస్తు శాఖ వారిని సంప్రదించామని, పురావస్తు శాఖ మాజీ అధికారి అంజనీ మున్షీ వాటిని పురాతన వస్తువులుగా ఆమోదించారని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)