ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ నివాసి రోష్ని(21), ముఖ్తార్ అహ్మద్ (22) లకు జూన్ 17న వివాహం జరిగింది. అయితే జూన్ 19 పెద్ద ఎత్తున వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఎంతో చలాకీగా ఉన్న రోష్ని ఒక్కసారిగా అన్ ఈజీగా ఫీలయింది. కడుపునొప్పి, వాంతులు, లూజ్ మోషన్స్ కావడంతో నీరసపడింది. దీంతో వెంటనే ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. రోష్ని చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అనిల్ కుమార్ తెలిపారు. ఈ సంఘటన గోపిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రోష్ని మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
రిసెప్షన్ రోజు పెళ్లి కూతురు దుర్మరణం !
June 20, 2023
0
Tags