కర్ణాటకలో తొలిరోజు 5.71 లక్షల మంది మహిళల ప్రయాణం

Telugu Lo Computer
0


కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణానికి అనూహ్య స్పందన లభించింది. తొలిరోజు ఆదివారం 5,71,023 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. బెంగళూరుతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 1 నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా ప్రయాణించినట్టు అధికారులు వెల్లడించారు. వీరి ప్రయాణాల ద్వారా రూ.1,40,22,898 రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లకు చెల్లించాల్సి ఉంది. కేఎస్ఆర్టీసీలో 1.93 లక్షల మంది ప్రయాణించగా రూ.58.16 లక్షలు, బీఎంటీసీలో 2.01లక్షల మంది మహిళలు ప్రయాణించగా రూ.26.19 లక్షలు, కల్యాణ కర్ణాటకలో 53,623 మంది ప్రయాణించగా రూ.19.70 లక్షలు, వాయువ్య కర్ణాటకలో 1.28 లక్షలమంది ప్రయాణించగా రూ.36.17 లక్షలుగా నిర్ణయించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)