మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 12వ తరగతి పరీక్షల్లో టాపర్లుగా నిలిచిని విద్యార్థులకు ఈ స్కూటర్లు ఇవ్వాలన్న నిర్ణయానికి మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఈ ఏడాది చివరి నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (ఎస్సీ, ఎస్టీ) విద్యార్థులకు స్కాలర్షిప్ల కోసం కుటుంబ ఆదాయ పరిమితిని రూ. 6 లక్షల నుండి రూ. 8 లక్షలకు పెంచే ప్రతిపాదనను శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గం ఆమోదించింది. ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో విద్యనభ్యసించి ప్రథమ స్థానం సాధించిన ప్రతి విద్యార్థికి ఇ-స్కూటర్ అందించాలని మంత్రివర్గం నిర్ణయించిందని హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు.ఈ పథకం ద్వారా దాదాపు 9 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. దీని అమలు కోసం 2023-24 బడ్జెట్లో రూ.135 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ-స్కూటర్ అందుబాటులో లేని ప్రాంతాల్లో పెట్రోల్తో నడిచే స్కూటర్ను అందజేస్తామని మిశ్రా తెలిపారు.ఒక పాఠశాలలో ఒకటి కంటే ఎక్కువ మంది విద్యార్థులు అగ్రస్థానంలో ఉంటే, వారందరికీ ఈ-స్కూటర్లను అందజేస్తామన్నారు.రాష్ట్ర సహకార విధానం 2023కి కూడా బుధవారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
12వ తరగతి పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన వారికి ఈ స్కూటర్లు !
June 15, 2023
0
Tags