పెళ్లికి 51 ట్రాక్టర్లతో తరలి వెళ్లిన వరుడు !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని బాడ్‌మేర్‌ జిల్లా గూడమలాని గ్రామానికి చెందిన ప్రకాష్‌ చౌదరి  వధువు మమత గ్రామమైన రోలికి 51 ట్రాక్టర్లపై 200 మందిని పెళ్లి ఊరేగింపుగా తీసుకువెళ్లాడు.   రైతు కుటుంబానికి చెందిన వరుడు ప్రకాష్‌ చౌదరి తాను కూడా స్వయంగా ఓ ట్రాక్టరు నడిపాడు. తమ కుటుంబ ప్రధాన వృత్తి వ్యవసాయమని చెప్పిన ప్రకాష్‌ ఇతర వాహనాలను కాకుండా సేద్యానికి వినియోగించే ట్రాక్టర్లనే వేడుకకు వాడాలని అనుకున్నట్లు చెప్పాడు.  ఈ వినూత్న పెళ్లి కార్యక్రమం జనాలను ఆకర్షించింది.  నెట్టింట ఈ వీడియో వైరల్ అయ్యింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)