స్వర్ణ దేవాలయం సమీపంలో మరో పేలుడు

Telugu Lo Computer
0


పంజాబ్ లోని స్వర్ణ దేవాలయం సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్ లో మరో పేలుడు సంభవించింది.  ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ధాటికి భవనం గాజు తలుపులు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మరునాడే అంటే సోమవారం ఉదయం 6.30గంటలకు అమృత్ సర్ గోల్డెన్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్ లో మరోపేలుడు సంభవించింది. ఒకరు గాయపడ్డారు. ఈ ఘటనతో బాంబుస్వ్కాడ్, ఎఫ్ఎస్ఎల్ బృందాలు హుటాహుటినా చేరుకున్నాయి. పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో 24 గంటల్లో రెండుసార్లు పేలుడు సంభవించిటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒకే చోట వరుసగా పేలుళ్లు జరగడంతో ఆ ప్రాంతంలో పోలీసులు మరింత భద్రతను పెంచారు. ఈ పేలుడు వెనక కారణమేంటో విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోందని స్థానికులు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని అమృత్‌సర్ పోలీసులు సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)