మాల్ లో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ తాటికొండ ఐశ్వర్య మృతి

Telugu Lo Computer
0


అమెరికాలోని టెక్సాస్‌లో నిన్న అలెన్ మాల్ లో దుండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 8 మంది చనిపోయారు. ఈ కాల్పుల్లో తాటికొండ ఐశ్వర్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. తాడికొండ ఐశ్వర్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాటికొండ ఐశ్వర్య మరణించారు. తాటికొండ ఐశ్వర్య మరణించినట్లు తెలుగు సంఘాలు ధృవీకరించాయి. రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ తాటికొండ నర్సిరెడ్డి కుమార్తె తాటికొండ ఐశ్వర్య హైదరాబాద్ లోని  కొత్తపేటలో నివాసం ఉంటారు. ఐశ్వర్య మృదేహాన్ని హైదరాబాద్ కు రప్పించేందుకు కుటుంబ సభ్యులతో పాటు అమెరికా తెలుగు సంఘాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికాలో కాల్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. టెక్సాస్‌లోని ఓ మాల్‌కు శనివారం మధ్యాహ్నం కారులో వచ్చిన దుండగుడు జనంపైకి ఇష్టారాజ్యంగా కాల్పులకు తెగబడ్డాడు. దాంతో అక్కడి వారంతా భయంతో కేకలు వేస్తూ రక్షణ కోసం పరుగులు తీశారు. కాల్పుల శబ్దాలు, జనం కేకలతో అక్కడ విధుల్లో ఉన్న ఓ పోలీసు అప్రమత్తమై సాయుధున్ని కాల్చి చంపాడు. అప్పటికే దుండగుని కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో కన్నుమూశారు. మరో ఏడుగురు గాయపడ్డారు. అమెరికాలో ఈ ఏడాదిలో నాలుగు నెలల్లోనే ఇప్పటిదాకా 198 కాల్పుల ఘటనలు జరగడం గమనార్హం. 

Post a Comment

0Comments

Post a Comment (0)