ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో ఆటోలో ఇంటికి వెళ్తున్న ఒంటరి మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి సమయంలో ఓ మహిళ చిలకలూరిపేటలో శుభకార్యానికి వెళ్లి తెనాలి వచ్చింది. అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ముసలపాడు గ్రామ శివారులో డ్రైవర్ ఆటోను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. బెదిరించి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వద్ద బంగారం ఆభరణాలు, నగదు తీసుకొని ఆటో వదిలి డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడనీ పోలీసులకు బాధితురాలు వివరించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం
May 12, 2023
0
Tags