హెచ్‌డీ రేవణ్ణ అరెస్టు !

Telugu Lo Computer
0


ర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హెచ్‌డీ రేవణ్ణను అదుపులోకి తీసుకుంది. బెంగళూరు నుంచి హెచ్‌డీ రేవణ్ణను సిట్ కస్టడీలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కిడ్నాప్ కేసులో అరెస్ట్ కాకుండా మధ్యంతర రక్షణ కోసం హెచ్‌డీ రేవణ్ణ చేసిన అభ్యర్థనను స్థానిక కోర్టు తిరస్కరించిన వెంటనే కర్ణాటక పోలీసు బృందం హెచ్‌డీ రేవణ్ణను కస్టడీలోకి తీసుకుంది. ఫిర్యాదుదారుడు మే 2 గురువారం పోలీసులను ఆశ్రయించాడు. అతని తల్లి 6 సంవత్సరాలు రేవణ్ణ ఇంట్లో సహాయకురాలిగా పనిచేసిందని.. మూడేళ్ల క్రితం ఆమె ఉద్యోగం మానేసి కూలి పనులు చేయడం ప్రారంభించిందని చెప్పారు. ఎన్నికలకు మూడు రోజుల ముందు సతీష్ అనే వ్యక్తి తమ ఇంటికి వెళ్లి భవానీ రేవణ్ణ ఆయన ఇంటికి పిలుస్తున్నాడని చెప్పాడని పేర్కొన్నారు. దీంతో తన తల్లి అక్కడికి వెళ్లిందని.. ఎన్నికల రోజైన 26వ తేదీన తిరిగి వచ్చిందదని తెలిపారు. ''ఆ సమావేశంలో పోలీసులు ఆమెను సంప్రదించడానికి ప్రయత్నిస్తారని, ఆమె వారితో మాట్లాడకూడదని నా తల్లికి చెప్పారు. మళ్లీ ఏప్రిల్ 29వ తేదీన సతీష్ ఇంటికి వచ్చి.. మా అమ్మను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేస్తే మేమంతా జైలుకు వెళ్తామని చెప్పాడు. నా తల్లిని తన వద్దకు తీసుకురావాలని హెచ్‌డీ రేవణ్ణ చెప్పినట్లు ఆయన పేర్కొన్నాడు. అతను తన బైక్‌పై నా తల్లిని బలవంతంగా తీసుకెళ్లాడు. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ తెలియడం లేదు. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేసి.. సెక్స్ టేప్‌లలో నా తల్లి కనిపించిందని, ప్రజ్వల్ రేవణ్ణ ఆమెను వేధించాడని చెబుతున్నారు. ఆమెను వదిలపెట్టమని నేను సతీష్‌ను అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకపోయింది. నా తల్లికి ప్రాణహాని ఉంది.. రేవణ్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి'' అని ఫిర్యాదుదారుడు కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం కిడ్నాప్‌కు గురైన మహిళ ఆచూకీ కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేపట్టారు. తనపై అత్యాచారం చేసిన ప్రజ్వల్ రేవణ్ణకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా అడ్డుకునేందుకే ఆ మహిళను కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)