ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కల్పాతి వెంకటరామన్ విశ్వనాథన్లతో భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమం సుప్రీంకోర్టు వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారమైంది. ఇటీవల జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ ఎంఆర్. షాలు పదవీ విరమణ చేయడంతో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరింది. వీరిద్దరి నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యా బలం తిరిగి 34కి చేరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ మిశ్రా, జస్టిస్ విశ్వనాథన్లను నియమించాలని గురువారం రాష్ట్రపతి కార్యాలయం నుండి వారెంట్ జారీ అయ్యింది. నూతన న్యాయ మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన అర్జున్ రామ్ మేగ్వాల్ వీరి నియామకాలను ట్విటర్లో ప్రకటించారు.
సుప్రీంకోర్టు జడ్జీలుగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, విశ్వనాథన్ ల ప్రమాణ స్వీకారం !
May 19, 2023
0
Tags