కేరళలో వందేభారత్ ఎక్స్ప్రెస్పై మరలా రాళ్ల దాడి జరిగింది. వారం వ్యవధిలో ఇది రెండో ఘటన. దీంతో అధికారుల అప్రమత్తం అయ్యారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 3.27 గంటలకు వలపట్టణం- కన్నూర్ చిరక్కల్ మధ్య రైలు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు రువ్వారు. రైలు కాసరగోడ్ నుంచి తిరువనంతపురం వెళ్తోంది. రైలు ఉత్తర కేరళలోని జిల్లాలోని వలపట్టణం ప్రాంతం గుండా వెళ్తుండగా దాని కిటికీ అద్దాలపై రాళ్లు రువ్వడం వల్ల స్క్రాచ్ అయినట్లు రైల్వే అధికారులు గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. రైలుపై రాళ్లు రువ్వినట్లు అనుమానించిన రైల్వే అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన సరిగ్గా దాని వలపట్టణం పరిధిలో జరిగిందని నిర్ధారించనప్పటికీ, దర్యాప్తు ప్రారంభించామనీ, ఇటువంటి సంఘటనలు మరోసారి జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
కేరళలో వందేభారత్ ఎక్స్ప్రెస్పై మరలా రాళ్ల దాడి !
May 09, 2023
0
Tags