దేశంలో కొత్తగా 405 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల వ్యవధిలో 1,08,726 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 405 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో మొత్తం కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4,49,87,339కి చేరింది. ప్రస్తుతం దేశంలో 7,104 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు కొవిడ్‌ నుంచి 4,44,48,392 మంది కోలుకున్నారు. ఇక నిన్న ఒక్కరోజే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,843కి ఎగబాకింది. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతం కాగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)