18న కొలువుదీరనున్న కొత్త కేబినెట్‌ !

Telugu Lo Computer
0


కర్ణాటక కొత్త కేబినెట్‌కు ముహూర్తం ఖరారైంది. మే 18న కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజున కేబినెట్‌ మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. అదే విధంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా అన్ని భావసారూప్యత కలిగిన పార్టీలకు కాంగ్రెస్‌ ఆహ్వానం పంపింది. కర్ణాటకలో హంగ్‌ తప్పదనుకున్న ఊహాగానాలకు పటాపంచల్ చేస్తూ ఏకంగా 136 స్థానాలను హస్తంగతం చేసుకుంది. గత ఎన్నికల కంటే 55 స్థానాలు ఎక్కువ సాధించింది. 43 శాతం ఓట్‌ షేర్‌ రాబట్టింది. 2018 ఎన్నికల్లో 104 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి కేవలం 65 సీట్లకే పరిమితమైంది. 14 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. ఈ ఓటమితో దక్షిణాదిన ఏకైక రాష్టం కూడా బీజేపీ చేజారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)