వాతావరణ మార్పులపై ప్రజలు ఉద్యమించాలని, అప్పుడే ఈ పోరాటంలో మానవాళి విజయం సాధిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ బ్యాంకు నిర్వహించిన ఓ పర్యావరణ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ''ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వాతావరణమార్పులు.. ప్రభావాల గురించి చాలా విషయాలు వింటున్నారు. ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే వారికేం చేయాలో తెలియదు. ఇది ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు చేయాల్సిన పని అని భావిస్తున్నారు. తాము కూడా ఇందులో పాల్గొనవచ్చని వారికి అర్థమైతే వారి ఆందోళన కార్యాచరణలోకి మారుతుంది. అప్పుడు జనఉద్యమంగా ఇది రూపాంతరం చెందుతుంది'' అని మోదీ తెలిపారు.
వాతావరణ మార్పులపై ఉద్యమం రావాలి
April 16, 2023
0
Tags