మసీదుపై దుండగుల దాడి !

Telugu Lo Computer
0


హర్యానాలోని సోపట్‌లోని సందాల్‌ కలాన్‌లో ఉన్న ఓ మసీదుపై దుండగులు దాడిచేశారు. మసీదును ధ్వంసం చేయడంతోపాటు అందులో నమాజ్‌ చేసుకుంటున్న వారిని విచక్షణారహితంగా కొట్టారు. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సాయుధులైన 15 నుంచి 20 మంది వ్యక్తులు మసీదులోకి ప్రవేశించారు. తమ చేతుల్లో ఉన్న కర్రలతో మసీదును ధ్వంసం చేశారు. అక్కడ ప్రార్ధన చేస్తున్నవారిపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సోనిపట్‌ దవాఖానకు తరలించారు. అయితే మసీదుపై దాడి ఎందుకు చేశారనే విషయం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడింది అదే గ్రామానికి చెందినవారుగా అనుమానిస్తున్నామన్నారు. కాగా, ఘటన తర్వాత గ్రామంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. దాడికి పాల్పడినవారి చిత్రాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సర్య్కులేట్‌ అవుతున్నాయి. వారి చేతుల్లో వెదురు కర్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)