హెలికాప్టర్ సెల్ఫీ మోజు ప్రభుత్వ అధికారి ప్రాణం తీసింది !

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్‌ లోని కేదార్‌ నాథ్‌ లో జితేంద్ర కుమార్ సైనీ అనే ప్రభుత్వ అధికారి హెలికాప్టర్‌ తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఆయన ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌ మెంట్ అథారిటీకి ఫైనాన్షియల్ కంట్రోలర్‌ గా ఉన్నారు. ఆయనకు హెలికాప్టర్లు కొత్తేమీ కాదు. కానీ కేదార్ నాథ్ లోని హెలిప్యాడ్ వద్ద ఇటీవల ప్రయాణికులకోసం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ని చూడగానే ఆయనకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఆ హెలికాప్టర్ బ్యాక్ గ్రౌండ్ లో సెల్ఫీ వీడియో జితేంద్ర కుమార్ తీసుకున్నాడు. హెలికాప్టర్ ముందు నుంచి క్రమంగా వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. వెనుకవైపు ఉన్న టెయిల్ రోటర్ దగ్గరగా వెళ్లాడు. టెయిల్ రోటర్ వేగంగా తిరుగుతున్న విషయాన్ని మరచిపోయాడు. ఆ రోటర్ రెక్క తగిలి జితేంద్ర అక్కడికక్కడే చనిపోయాడు. యాత్రకోసం ఇప్పటి వరకు 16లక్షలమంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కేదార్ నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25న తెరుస్తారు, బద్రీనాథ్ ను ఏప్రిల్ 27న తెరుస్తారు. యాత్ర సందర్భంగా ప్రయాణికులకోసం కేదార్ నాథ్ దగ్గర హెలికాప్టర్ సౌకర్యం కల్పించారు. ఈ హెలికాప్టర్ దగ్గరే ప్రభుత్వ అధికారి జితేంద్ర ప్రాణం పోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)