దేశంలో కొత్తగా 6,660 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 6,660 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.49 కోట్లకు చేరిందని మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 63,380 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక కరోనాతో సోమవారం ఒక్కరోజే 24 మంది మృతి చెందారు. కేరళలోనే అత్యధికంగా తొమ్మిది మంది కరోనాకు బలయ్యారు. దీంతో కరోనాతో 5,31,369 మంది మృతి చెందినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 3.52 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.67 శాతంగా ఉంది. ఇప్పటివరకు 4,43,11,078 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. కోవిడ్‌ మరణాల రేటు 1.18 శాతంగా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)