మృత దేహానికి అంతిమ స్నానం చేస్తుండగా లేచాడు...!

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా రూర్కీలోని ఝబ్రెడా పట్టణానికి చెందిన 58 ఏళ్ల దీపక్ కుమార్ కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. అయితే ఉన్నట్టుండి దీపక్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. దీపక్ మరణవార్తతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు బంధువులను సమాచారమిచ్చారు. అంతా వచ్చి దీపక్‌కు నివాళులు అర్పించారు. దీపక్ మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృత దేహానికి అంతిమ స్నానం చేస్తుండగా దీపక్ లేచాడు. అక్కడున్న వారిని చూసి 'ఏం చేస్తున్నారు?' అని అడిగాడు. ఈ సీన్‌ చూసిన అక్కడున్న వారిలో కొంత స్పృహ కోల్పోయారు. వెంటనే తెరుకున్న కుటుంబసభ్యులు దీపక్‌ను మరోసారి ఆస్పత్రికి తరలించారు. అంతిమ స్నానం సమయంలో దీపక్ లేచి  మాట్లాడి మళ్లీ పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. దీపక్‌ను రూర్కీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు మృతదేహంతో మళ్లీ గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. మృతదేహానికి కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)