వ్యాన్‌తో లారీ ఢీ : ఆరుగురు మృతి

Telugu Lo Computer
0


తమిళనాడులోని త్రిచి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. తిరువాసి సమీపంలో ముందు వెళ్తున్న వ్యాన్‌ను లారీ ఢీ కొట్టడంతో వ్యాన్‌ ఉన్న ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని త్రిచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)