మిథునం వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన మొయిద ఆనందరావు (57) కన్నుమూశారు. డయాబెటిస్తో బాధపడుతున్న ఆయన కొంత కాలంగా వైజాగ్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన ఆనందరావు ఓ ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభిచారు. ఆ తర్వాత వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. సంఘసేవకుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. అందుకే తన స్వగ్రామంలో రూ.25 లక్షలు ఖర్చు చేసి ఓ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. సాహిత్యంపై కూడా ఆనందరావుకు మక్కువ ఎక్కువ. పర్యావరణ హిత పద్యాలను రాసి కోటిగాడు పేరుతో ప్రచురించేవారు. ఇక సినిమాల విషయానికొస్తే 2012లో మిథునం సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ కీలక పాత్రల్లో నటించారు. తనికెళ్ల భరణి ఈ చిత్రానికి దర్శకుడు. కేవలం రెండే పాత్రలతో నడిచే ఈ సినిమా విమర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2017లో మిథునం చిత్రానికి నంది అవార్డు కూడా వరించింది. ఆనందరావు విషయానికొస్తే ఆయనకు భార్య పద్మినితో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Post Top Ad
adg
Thursday, 16 March 2023
Home
cinema
పర్యావరణ హిత పద్యాలను రాసి కోటిగాడు పేరుతో ప్రచురించేవారు
మిథునం నిర్మాత కన్నుమూత
మొయిద ఆనందరావు
విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస
మిథునం నిర్మాత కన్నుమూత !
మిథునం నిర్మాత కన్నుమూత !
Tags
# cinema
# పర్యావరణ హిత పద్యాలను రాసి కోటిగాడు పేరుతో ప్రచురించేవారు
# మిథునం నిర్మాత కన్నుమూత
# మొయిద ఆనందరావు
# విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస
About Telugu Lo Computer
విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస
Tags
cinema,
పర్యావరణ హిత పద్యాలను రాసి కోటిగాడు పేరుతో ప్రచురించేవారు,
మిథునం నిర్మాత కన్నుమూత,
మొయిద ఆనందరావు,
విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment