న్యూ ఢిల్లీలో జరిగిన 29వ లాల్ బహదూర్శాస్త్రి స్మారక ఉపన్యాస కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ జై జవాన్, జై కిసాన్ నినాదంతో ఆత్మనిర్భర్ భారత్కు శ్రీకారం చుట్టిన తొలివ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు. గొప్ప దార్శనికత గల శాస్త్రీజీ పలు తరాలకు స్ఫూర్ తిప్రదాతగా నిలిచినట్లు తెలిపారు. పార్లమెంటులో అధికారపక్ష, విపక్ష ఆందోళనల గురించి స్పందిస్తూ చర్చలు, నిర్ణయాలు జరగాల్సిన సభలో అంతరాయాలు మంచివి కాదన్నారు. మన దేశంలో వక్రబుద్ధి గల కొందరు పెద్దలు విదేశాలకు వెళ్లి బ్రిటిష్ పాలనే బాగుండేదని చెబుతుంటారని, అదృష్టవశాత్తు రాజకీయ నేతలెవరూ అలా చెప్పడం లేదన్నారు. ఆ పెద్దల పేర్లు చెప్పడం తనకు ఇష్టం లేదని వెంకయ్యనాయుడు తెలిపారు.
భారత ప్రగతిని పాశ్చాత్య శక్తుల హర్షించలేకపోతున్నాయి !
March 22, 2023
0
Tags