తల్లిని కాపాడిన కూతురు !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా కెయ్యూరు గ్రామ శివార్లలోని ఎట్కెడ్య గ్రామంలో ఇంటి పెరడులో పని చేసుకుంటున్న గృహిణి మమతను నాగుపాము కాటేసింది. ఆమె కేకలు వేస్తూ కిందపడిపోయారు. పక్కనే ఉన్న ఆమె కుమార్తె శ్రమ్య వేగంగా స్పందించింది. పాము కాటుకు గురైన తల్లి కాలికి కట్టు కట్టి, విషం శరీర భాగాలకు పాకకుండా చేసింది. ఆ తర్వాత విషంతో కూడిన రక్తాన్ని నోటితో పీల్చి ఉమ్మేసింది. ఇరుగు పొరుగు వారి సాయంతో తల్లిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లింది. సమయస్ఫూర్తితో తల్లి ప్రాణాల్ని కాపాడిన శ్రమ్యను స్థానికులు ప్రశంసించారు. ఈ విషయం తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)