మహారాష్ట్రలో కొత్తగా 334 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలో ఈరోజు కొత్తగా 334 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు రికార్డు కాలేదు. మరణాలు కూడా నమోదు కాలేదు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,648కి చేరింది. ఈ పరిణామాల మధ్య మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకునే అవకాశాలు లేకపోలేదు. కోవిడ్ కేసుల సంఖ్య ఆందోళనకరంగా కనిపించిన జిల్లాల్లో ఆంక్షలను విధించే అవకాశాలు ఉన్నాయి. ఆయా జిల్లాలకు సమీపంలో ఉన్న రాష్ట్ర సరిహద్దుల వద్ద గల చెక్ పోస్టులను బలోపేతం చేయొచ్చని తెలుస్తోంది. కేసుల్లో పెరుగుదల ఇదే తరహాలో కొనసాగితే మాత్రం సరిహద్దులను మూసివేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)