ఇండోనేషియా చమురు డిపోలో అగ్నిప్రమాదంలో 17 మంది దుర్మరణం

Telugu Lo Computer
0


ఇండోనేషియాలో చమురు డిపోలో మంటలంటుకొని సుమారు 17 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. డిపోకు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలు ఆర్పడానికి 52 ఫైర్‌ ఇంజిన్లు, 260 ఫైర్‌ ఫైటర్స్‌ కాలంతో పోటీ పడి మంటలను ఆర్పడానికి పోరాడుతున్నారని అధికారులు తెలిపారు. ప్రభుత్వరంగానికి చెందిన ఈ చమురు సహజ వాయువు కంపెనీ పెర్టామినా ఉత్తర జకార్తాలో తన్హా మెరా ప్రాంతంలో ఉంది. కాగా ఈ డిపోకు చుట్టుపక్కల అత్యధిక జనాభాతో కిటకిట లాడుతోంది. దీంతో పాటు ఈ డిపో దేశీయ అవసరాల్లో 25 శాతం తీరుస్తోంది. చమురు డిపోకు మంటలు అంటుకోగానే దేశంలోని అన్ని టెలివిజన్‌ చానల్స్‌ ఎద్ద ఎత్తున కవరేజీ ఇచ్చాయి. ఒక వైపు దట్టమై పొగ మరో వైపు మంటలు ఎగిసిపడుతున్నాయి. కాగా ఫైర్‌ ఫైటర్స్‌ మంటలను అదుపులోకి తేవడానికి తీవ్రంగా పోరాడుతున్నారు. ప్రాథమిక విచారణలో తేలింది ఏమిటంటే కార్మికులు మెరుపు సమ్మెకు దిగడంతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పైప్‌లైన్‌ రాపిడికి గురై మంటలంటుకొనే అవకాశం ఉందని కంపెనీ ఏరియా మేనేజర్‌ తెలిపారు. అయితే ఈ డిపోకు మంటలంటుకున్నందు వల్ల సరఫరాపై పెద్ద ప్రభావం ఉండదని చెప్పారు. జాకార్తా గవర్నర్‌ హెరు బుడి హర్టానో డిపోలో మంటల గురించి ప్రస్తావిస్తూ సుమారు 600 మందిని ప్రభుత్వ కార్యాలయాల్లోకి, స్పోర్ట్‌ స్టేడియంలో తాత్కాలక బస ఏర్పాటు చేశామని చెప్పారు.. ప్రమాదం గురించి జాకార్తా ఫైర్‌ డిపార్టుమెంట్‌ చీఫ్‌ మాట్లాడుతూ డిపోలో మంటలంటుకోవడంతో సుమారు 17 మంది మృతి చెందారని.. వారిలో ఇద్దరు పిల్లలు.. 50 మంది కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. కాగా డిపోలో మంటలంటుకోవడం వెంటనే పలు చోట్ల భారీ పేలుళ్లు సంభవించి అటు తర్వాత మంటలు కాస్తా చుట్టు పక్కల ఉన్న ఇళ్లకు పాకాయన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)