ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసిన పది మంది కౌన్సిలర్లను మేయర్ కోసం జరిగే ఓటింగ్కు ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ (బీజేపీ) అనుమతించారు. ఈ తరుణంలో వాళ్లంతా బీజేపీకే ఓటేస్తారని, సత్యశర్మ బీజేపీ గనుక సొంత పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆప్ మొదటి నుంచి వాదిస్తోంది. పైగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(డీఎంసీ) యాక్ట్ 1957 ప్రకారం.. నామినేటెడ్ సభ్యులు ఓటింగ్లో పాల్గొనేందుకు అర్హత లేదని గుర్తు చేసింది. ఈ తరుణంలో మూడుసార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడగా, ఆప్ సుప్రీంను ఆశ్రయించింది. ఆప్ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు, నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్లో పాల్గొనే అర్హత లేదని స్పష్టం చేసింది. అంతేకాదు 24 గంటల్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై నోటిఫికేషన్ ఇవ్వాలని, ఎన్నిక నిర్వహణ తేదీని కూడా స్పష్టంగా ప్రకటించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ఢిల్లీ మేయర్ ఎన్నికపై ప్రతిష్టంభన తొలిగిపోయే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సుప్రీం తీర్పుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు.
Post Top Ad
adg
Friday, 17 February 2023
Home
ఆప్ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు
ఢిల్లీ మేయర్ ఎన్నిక
నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కులేదు
మూడుసార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడగా
నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కులేదు !
నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కులేదు !
Tags
# ఆప్ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు
# ఢిల్లీ మేయర్ ఎన్నిక
# నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కులేదు
# మూడుసార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడగా
About Telugu Lo Computer
మూడుసార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడగా
Tags
ఆప్ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు,
ఢిల్లీ మేయర్ ఎన్నిక,
నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కులేదు,
మూడుసార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడగా
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment