టర్కీ, సిరియాలకు ఆపరేషన్ దోస్త్

Telugu Lo Computer
0


భూకంపాలతో అల్లకల్లోలంగా మారిన టర్కీ, సిరియాలకు భారత దేశం నుంచి సహాయం కొనసాగుతోంది. బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు అవసరమైన అన్ని రకాల ఆహార పదార్థాలు, మందులు, పరికరాలను భారత వైమానిక దళం విమానాల్లో పంపిస్తున్నారు. 'ఆపరేషన్ దోస్త్' పేరుతో జరుగుతున్న ఈ కార్యకలాపాల్లో భాగంగా ఏడో విమానం ఆదివారం అడానా విమానాశ్రయంలో దిగింది. ఐఏఎఫ్ సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానంలో 13 టన్నుల మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను టర్కీ కోసం, 24 టన్నుల సహాయాన్ని సిరియాకు భారత దేశం పంపించింది. ఇండియన్ అంబాసిడర్ డాక్టర్ వీరేందర్ పౌల్, డిఫెన్స్ అటాచ్ కల్నల్ మనూజ్ గార్గ్, టర్కీ ప్రభుత్వ అధికారులు ఈ కన్‌సైన్‌మెంట్‌ను స్వీకరించారు. టర్కిష్ ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ తరపున అంబాసిడర్ మెహ్మెత్ ఈ కన్‌సైన్‌మెంట్‌ను స్వీకరించారు. నిద్రపోవడానికి చాపలు, జనరేటర్ సెట్లు, సోలార్ ల్యాంప్స్, టార్పాలిన్లు, దుప్పట్లు, వెంటిలేటర్ మెషిన్స్, అనస్థీషియా మెషిన్స్, ఇతర పరికరాలు, ఈసీజీ, పేషెంట్ మానిటర్, సిరంజ్ పంప్స్, గ్లూకోమీటర్, పారా ఫీల్డ్ హాస్పిటల్ కోసం మందులు ఈ విమానంలో ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ ఆసుపత్రిలో రోజుకు 400 మంది రోగులకు చికిత్స చేస్తున్నారు. ఆపరేషన్ దోస్త్‌లో భాగంగా ఈ ఏడో విమానం శనివారం బయల్దేరింది. దీనిలో ప్రాణాలను కాపాడే మందులు, సహాయక సామాగ్రి, అత్యంత విషమ పరిస్థితుల్లో ఉండే రోగులను కాపాడే ఔషధాలు, మొబైల్ ఆసుపత్రి, ప్రత్యేక నైపుణ్యంగల గాలింపు, సహాయక బృందాలు ఉన్నాయి. ఈ విమానం మొదట సిరియా రాజధాని నగరం డమాస్కస్‌కు వెళ్లి, ఆ దేశానికి కేటాయించిన సహాయాన్ని అందజేసింది. ఆ తర్వాత అడానా విమానాశ్రయానికి వెళ్లి టర్కీకి సహాయాన్ని అందజేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)